విదేశాల నుంచి వచ్చిన వారిని ఇప్పుడు పెయిడ్ క్వారంటైన్ కి ప్రభుత్వాలు తరలిస్తున్న సంగతి తెలిసిందే. వందే భారత్ మెషిన్ లో భాగ౦గా వచ్చిన వారికి అన్ని రకాల వైద్య పరిక్షలు చేసి వారిని పెయిడ్ క్వారంటైన్ కి తరలిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు  పెయిడ్ క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు బేగం పేట పెయిడ్ క్వారంటైన్ లో కలకలం రేగింది. పెయిడ్ క్వారంటైన్ లో భాగంగా ఉన్న 5 మందికి కరోనా సోకింది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం వారిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మరోసారి ఆ హోటల్ లో ఉన్న వారు అందరికి పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: