ఆంధ్రప్రదేశ్ లో విమాన ప్రయాణాలు మొదలు కావడంతో ఇప్పుడు అన్ని విమానాశ్రయాలకు భారీగా ప్రయాణికులు చేరుకుంటున్నారు. దేశీయ విమానాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో దాదాపు అన్ని విమానాశ్రయాలను ఓపెన్ చేసారు. విశాఖ గన్నవరం రేణిగుంట విమానాశ్రయాలకు భారీగా ప్రయాణికులు చేరుకున్నారు. 

 

ఇక కృష్ణ జిల్లా గన్నవరం విమానాశ్రయానికి కూడా ప్రయాణికులు భారీగా చేరుకున్నారు. వారి అందరికి మాస్క్ లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తున్నారు. లగేజి కూడా శానిటేషన్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఇక బోర్డింగ్ సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాజిక దూరం అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అటు తెలంగాణాలోని హైదరాబాద్ విమానాశ్రయంలో కూడా భారీగా విమాన రాకపోకలు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: