టీటీడీ భూముల వేలం ప్రక్రియ నిలిపి వేయడంపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పరిపూర్ణానంద కూడా సిఎం వైఎస్ జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. హిందూ బంధువుల ఆందోళన రాకముందే వేలం నిలిపినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన లేఖ రాసారు. ఇప్పటిదాకా పని చేసిన సీఎంలు దేవుళ్లకు, హిందువులకు ఒరగబెట్టింది ఏమీలేదని ఆయన మండిపడ్డారు. 

 

వారి నిర్వాకం వల్లే 5 లక్షల కోట్ల పంట భూములు, లెక్కలేని ఆభరణాలు దోపిడీ కాబడ్డాయి అనేది అక్షర సత్యమని ఆయన పేర్కొన్నారు. దేవాలయ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ప్రజలు అందించిన ఆస్తుల వివరాలు వారికి తెలియ చెప్పడంలో తప్పులేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఈ పని మీరు చేస్తే నమ్మి ఓటు వేసిన హిందువులందరికీ న్యాయం చేసినవారవుతారని జగన్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: