కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. తినడానికి తిండి లేక ఇప్పుడు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అన్నం దొరకని ఎందరో పేదలకు సహాయం చేస్తున్నారు. తాజాగా బిజెపి మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)  కార్యకర్తలు పేదలకు అన్నదానం చేసారు. 

 

ఇతర రాష్ట్రాల నుంచి మొరాదాబాద్ స్టేషనుకు రైళ్లలో వచ్చిన వేలాది వలస కార్మికులకు భోజనం, మంచినీటి బాటిళ్లు అందించి మంచి మనసు చాటుకున్నారు. ఆ నగరానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ ముందుకు వచ్చి ఈ సహాయం చేసారు. రైల్వే స్టేషన్ లోనే వంట చేసి కార్మికులకు వడ్డించారు. ప్రతీ రోజు కూడా తాము పది వేల మందికి ఆహారం అందిస్తున్నామని సంఘ్ కార్యకర్తలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: