ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పై నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. నేడు పుత్తూరు లో ఆయన పర్యటించారు. దీనిపై రోజా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. నాకు చెప్పకుండా నా నియోజకవర్గాలో ఏ విధంగా పర్యటిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను నియోజకవర్గం లోనే ఉన్నా తనను కనీసం పట్టించుకోలేదని తనకు చెప్పకుండా పర్యటన ఎలా కొనసాగిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

ఇక ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే తమ వద్దకు రావాలి గాని ఈ విధంగా మీడియా కు వెళ్ళడం భావ్యం కాదని అంతిమంగా పార్టీ ఇబ్బంది పడుతుందని రోజాకు సూచించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై సిఎం జగన్ కూడా ఆరా తీసారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: