తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. పార్టీ యువ నేత, పర్చూరు నియోజకవర్గ శాసన సభ్యులు  ఏలూరి సాంబశివరావు నేడు సాయంత్రం వైసీపీకి జై కొట్టే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే గా ఉన్న కరణం బలరాం జగన్ కి జై కొట్టిన సంగతి తెలిసిందే. 

 

తాజాగా ఏలూరి కూడా పార్టీ  మారడానికి సిద్దమయ్యారు. నేడు సాయంత్రం ఆయన మంత్రి బాలినేని శ్రీనివాసరావు సమక్షంలో పార్టీ చేరే అవకాశం ఉందని సమాచారం. అయితే పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జగన్ కి జై కొట్టిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచే జగన్ కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: