ఆంధ్రప్రదేశ్ లో రైతులకు సిఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది తాము రైతులకు ఉచిత పంట బీమా సౌకర్యం కల్పిస్తామని సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేసారు. తాజాగా వ్యవసాయ రంగంపై జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపే 10,290 కోట్లు రైతుల కోసం ఖర్చు చేసామని సిఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 

 

నాలుగేళ్ళకు బదులు 5 ఏళ్ళు రైతు భరోసా ఇస్తామని జగన్ పేర్కొన్నారు. రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. మే లలో రైతులకు 7500 ఇచ్చామని అక్టోబర్ లో మరో నాలుగు వేలు ఇస్తామని జనవరి లో మరో 2 వేలు ఇస్తామని జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: