ఆంధ్రప్రదేశ్ సాగర తీరం విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లో గ్యాస్ లీక్ కావడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం దేశం మొత్తం దుమారం రేగడం తో సుమోటో గా కేసుని తీసుకుని ఏపీ హైకోర్ట్ దీనిపై విచారణ చేసి ఎల్జీ పాలిమర్స్ ని ఎవరి ఆదేశాలతో రీ ఓపెన్ చేసారని ప్రశ్నించింది. 

 

ఇక ఇదే సందర్భంలో కంపెనీ ని క్లోజ్ చెయ్యాలని హైకోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్ లు ఎవరూ దేశం దాటి వెళ్ళడానికి వీలు లేదని స్పష్టం చేసింది. దీనిపై ఎల్జీ పాలిమర్స్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది. హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయ్యాలని కోరింది. హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: