పాలన మొదలై ఏడాది సందర్భంగా సిఎం వైఎస్ జగన్ వ్యవసాయ అనుబంధ రంగాలపై మేధోమధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. వ్యవసాయం అభివృద్ధి మార్కెట్ ని పెంచుకునే చర్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. పాదయాత్రలో రైతుల కష్టాలను చూసాను అన్నారు జగన్.
మార్కెట్ యార్డుల్లో భారీ సంస్కరణలు వీటిని 191నుంచి 216కు పెంచామని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ బీసీ లకు మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నామని జగన్ పేర్కొన్నారు. మహిళలకు అన్ని మార్కెట్ యార్డు పదవుల్లో 50 శాతం పదవులు ఇచ్చామని ఆయన గుర్తు చేసారు. పదవుల్లో కూడా సామాజిక న్యాయం చేస్తున్నట్టు జగన్ ఈ సందర్భంగా వివరించారు.