ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి త్వరలోనే మరిన్ని షాకులు తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలోనే పార్టీ మారడానికి విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారు అని సమాచారం. విశాఖ జిల్లాలోని వెలగపూడి రామకృష్ణ తో పాటుగా మరో ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారడానికి సిద్దమయ్యారని అంటున్నారు. 

 

అయితే టీడీపీ యువ ఎమ్మెల్యే ఏలూరి చేరిక విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన పార్టీ మారే విషయం తనకు తెలియదు అంటూ జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్ చేసారు. పార్టీ మారే విషయంలో ఎమ్మెల్యేనే వివరాలు అడగాలని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ముగ్గురు ఎమ్మెల్యే వైసీపీ తీర్ధం పుచ్చుకునే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరి ఎవరు వెళ్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: