ఓడిస్సా లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అక్కడి కట్టడి అయినట్టే అయిన కరోనా రోజు రోజుకి తన ప్రతాపం చూపిస్తుంది గాని తగ్గడం లేదు. ఆ రాష్ట్రం లాక్ డౌన్ విషయంలో చాలా వరకు సీరియస్ గానే ఉంది. అయినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక ఇది పక్కన పెడితే ఓడిశా లోని రూర్కెలా లో ఒక వింత సంఘటన జరిగింది. 

 

తమ ప్రాంతంలో కంటైన్మేంట్ జోన్ ని ఎత్తి వెయ్యాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూ హింసకు దిగారు. పోలీసుల మీద రాళ్ళ దాడి కూడా చేయడం గమనార్హం. దీనితో మరిన్ని బలగాలను అక్కడి మొహరించి కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. బయటకు వచ్చిన వారి మీద లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: