తనను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తన భూ ఆక్రమణలను బయటపెడతామని మంత్రులు వ్యాఖ్యలు చేయడం పై కన్నా లక్ష్మీ నారాయణ ఫైర్ అయ్యారు. తన అవినీతిని బయటపెట్టే దమ్ము ఎవరికి లేదని తాను ఏ అవినీతి కూడా చేయలేదు అని ఆయన స్పష్టం చేసారు. 

 

లాక్ డౌన్ సమయంలో భూములను కబ్జా చేసారని వారి అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని కన్నా డిమాండ్ చేసారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఇంగ్లీష్ లో కూడా ఉత్తరం రాశామని ఆయన పేర్కొన్నారు. చీప్ రాజకీయాలు చెయ్యొద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. ఉపవాస దీక్షలు ముగిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: