హైదరాబాద్ లోని శంషా బాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలెట్ గుర్తించారు. ఈ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్ నుంచి ఫ్యూయల్ లీక్ అయింది. 

 

వెంటనే గుర్తించిన పైలెట్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయడం తో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో మొత్తం 76 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక ఇంజిన్ లో సాంకేతిక లోపం రావడం తో ఒకే ఇంజిన్ తో విమానాన్ని ల్యాండ్ చేసారు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకుని పైలెట్ ని అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: