కరోనా వైరస్ దెబ్బకు ముంబై చుక్కలు చూస్తుంది. వందల మంది రోజు కరోనా బారిన పడుతున్నారు అనే స్థాయి నుంచి వేల మంది కరోనా బారిన పడుతున్నారు అనే వరకు వెళ్ళాయి అక్కడి కేసులు. ఇక అక్కడ కరోనా మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఒక ఫోటో సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తాజాగా ముంబై కేఈఎమ్ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి అని ఒక ఫోటోని ట్వీట్ చేసారు. ఈ ఫొటోలో.. హాస్పిటల్ కారిడార్‌లో స్ట్రెచర్లపై మృతదేహాలు, ఆ మృతదేహాలపై కప్పబడిన నల్ల దుస్తులు ఉన్నాయి. ఇది కాస్త హృదయ విదారకంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: