తమిళనాడు లో కరోనా ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి అక్కడ వందల కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కూడా 600 పైగా కరోనా కేసులు నమోదు కావడం ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని బాగా కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులో ఈ రోజు 646 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,728 గా ఉంది. ఈ రోజు 9 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణించిన వారి సంఖ్య 127 గా ఉంది. ఇప్పుడు 8,256 క్రియాశీల కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై లో ఎక్కువగా కరోనా కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: