గుజరాత్ లో కరోనా  మరణాలపై ఇప్పుడు కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. గుజరాత్ లో ని అహ్మదాబాద్ నగరంలో కరోనా కేసులు పెరగడానికి నమస్తే ట్రంప్ కార్యక్రమమే కారణమని వ్యాఖ్యలు చేస్తుంది. అక్కడ 800 మంది మరణించడానికి కారణం నమస్తే ట్రంప్ కార్యక్రమం అని మండిపడింది కాంగ్రెస్. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు, మరణాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. 

 

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా ఈ ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై త్వరలోనే గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తాము హెచ్చరికలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: