తెలంగాణాలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలంగాణాలో నేడు ఒక్క రోజే 71 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 71 కేసులు నమోదు అయ్యాయి అని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1991 కి చేరుకుంది. 

 

ఈ రోజు ఒకరు కరోనా తో మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు 57 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. నేడు ఒక్క రోజే 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1284 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ నుంచే వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: