ప్రముఖ యువ హిందీ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మేరి దుర్గ, లాల్ ఇష్క్, క్రైం పెట్రోల్ లాంటి సీరియల్స్ ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు నిన్న ఉదయం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరణించానికి కొన్ని క్షణాల ముందు ప్రేక్ష మెహతా జీవితం గురించి పోస్ట్ లో పంచుకున్నారు.
అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మ్యాన్ సినిమాలో ప్రేక్ష మెహతా కీలక పాత్రలో నటించారు. భవిష్యత్తుపై భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని సన్నిహితులు చెబుతున్నారు. 25 సంవత్సరాల వయస్సులోనే ప్రేక్ష మెహతా కన్ను మూయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రేక్ష గదిలో సూసైడ్ నోట్ దొరికిందని సమాచారం.
View this post on InstagramMeri Taraf Aata Har Gham Phisal Jaaye Aankhon Mein Tum Ko Bharun Bin Bole Baatein Tumse Karun 🥰