జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసం సమీపంలో ఒక వ్యక్తి విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఎసిపి అశోక్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. అతను విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడని పేర్కొన్నారు. అతను ఇప్పుడు ప్రమాదంలో లేడన్నారు. 

 

తనకు బెదిరింపులు వస్తున్నాయని అతను పేర్కొంటూ ఆత్మహత్యా యత్నం చేసాడని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అతనిని ఒక అధికార పార్టీ నాయకుడు బెదిరిస్తున్నాడని అందుకే అతను సిఎం ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తుంది. ఈ ఘటనతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: