నేటి నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనుంది. దీనిని జూమ్ యాప్ లో పార్టీ నిర్వహించాలి అని నిర్ణయం తీసుకుని అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది. దీనిలో అందరూ పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను పార్టీ అభిమానులను విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్వీట్ చేసారు.
దేశంలోనే తొలిసారిగా,తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకునే విధంగా జూమ్ వెబినార్ వేదికగా ఆన్ లైన్ లో జరుగుతున్న డిజిటల్ మహానాడు 2020లో తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అందరూ పాల్గొనాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రతి మహానాడు మాదిరిగానే ఈ డిజిటల్ మహానాడును విజయవంతం చేయండని పిలుపునిచ్చారు లోకేష్.
దేశంలోనే తొలిసారిగా,తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకునే విధంగా జూమ్ వెబినార్ వేదికగా ఆన్ లైన్ లో జరుగుతున్న డిజిటల్ మహానాడు 2020లో తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అందరూ పాల్గొనండి.ప్రతి మహానాడు మాదిరిగానే ఈ డిజిటల్ మహానాడును విజయవంతం చేయండి#Mahanadu2020 pic.twitter.com/u6pNAOn5Kr
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 27, 2020