దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కాసేపటి క్రితం విడుదల చేసిన కరోనా బులిటెన్ లో పేర్కొంది. గత వారం రోజులుగా ప్రతీ రోజు ఆరు వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 

గత 24 గంటల్లో 6387 కొత్త కరోనా కేసులు... 170 మరణాలు సంభవించాయని పేర్కొంది కేంద్రం. దేశంలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 1,51,767 కాగా 83004 క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొంది. 64425  మంది కోలుకున్నారని కేంద్రం పేర్కొంది. మొత్తం 4337 మంది మరణించారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: