ఇప్పుడు మన దేశంలో ఆరోగ్య సేతు యాప్ ఏ స్థాయిలో కీలకం అయింది అనేది అందరికి తెలిసిన విషయమే. దీని కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. దీని భద్రత కూడా కీలకం కాబట్టి కేంద్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ప్రతీ ఒక్కరు కూడా దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచనలు చేస్తుంది. 

 

ఇక ఇదిలా ఉంటే దీనిలో మూడు బగ్స్ ఉన్నాయని వాటిని కనిపెట్టిన వారికి ఒక్కో బగ్ కి లక్ష రూపాయల చొప్పున మూడు లక్షలు ఇస్తామని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నీతా వర్మ ఒక ప్రకటనలో మీడియా కు తెలిపారు. అదే విధంగా కోడింగ్ ని మెరుగుపరిచిన వారికి కూడా లక్ష ఇస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: