ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు అనే చెప్పవచ్చు. పరిక్షలు చేస్తే కరోనా తగ్గుతుందని భావించి దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా పరిక్షలు చేస్తున్నా సరే ఫలితం కనపడటం లేదు. 

 

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 68 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో కరోనా కేసుల సంఖ్య 2787 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 58 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోగా యాక్టివ్ కేసులు 816 ఉన్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 1913 మంది డిశ్చార్జ్ అయ్యారని ఏపీ సర్కార్ పేర్కొంది. కొత్త కేసుల్లో కోయంబేడు లింకులు 9 ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: