తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మొదలైంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ లో పార్టీ జెండా ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. చెరో 5 నిమిషాల పాటు తెలంగాణా ఏపీ అధ్యక్షుడులు ప్రసంగం చేస్తారు 

 

ఎన్టీఆర్ భవన్ నుంచి ఎల్ రమణ, అలాగే గుంటూరు పార్టీ ఆఫీస్ నుంచి కళా వెంకట్రావు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఇక ఇది పక్కన పెడితే పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. జూమ్ యాప్ ద్వారా వీరు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు పాతిక వేల మంది పాల్గొంటారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: