ఇప్పుడు కరోనా రాకుండా ఉండాలి అంటే మాస్క్ చాలా అవసరం అనే సంగతి అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మాస్క్ చాలా అవసరమని చెప్తున్నారు. ప్రధాని నుంచి గ్రామ సర్పంచ్ వరకు అలాగే సినీ నటులు క్రికెటర్లు ఇలా అందరూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను చెప్తూ మాస్క్ చాలా అవసరమని అంటున్నారు. 

 

తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కూడా దీనిపై ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు మాస్క్ ని ధరించాలని ప్రజలకు సూచించారు మహేష్ బాబు. అదే విధంగా మాస్క్ ధరించిన ప్రముఖుల ఫోటో లను వన్ ఫ్రేమ్ లో మహేష్ బాబు పొందుపరిచారు. ప్రియాంకా చోప్రా హ్రితిక్ రోషన్, అలాగే తాను, మహేంద్ర సింగ్ ధోని వంటి వారి ఫోటోలు ఉన్నాయి. మాస్క్ ఇండియా నినాదాన్ని మహేష్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: