మహారాష్ట్రలో కరోనా వైరస్ ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే అది మాత్రం ఆగే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు అనే చెప్పాలి. కరోనా కట్టడికి అక్కడ పోలీసులు గట్టిగా పని చేస్తుంటే వారికి కూడా కరోనా సోకడం ఇప్పుడు భయపెడుతున్న అంశం. వందల మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. 

 

తాజాగా మరోసారి 75 మంది పోలీసులకు కరోనా సోకిందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీనితో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 1964 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇక అక్కడ పోలీసులకు కరోనా సోకడంతో ప్రభుత్వం 55 ఏళ్ళు దాటిన వారు డ్యూటి కి రావొద్దు అని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: