ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఆయన వ్యాఖ్యలు చేసారు. లాక్ డౌన్ వలన విశాఖ సందర్శించలేకపోయాను అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఘటన జరిగిన వెంటనే విశాఖ వెళ్ళాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరా అని తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగా అని చంద్రబాబు గుర్తు చేసారు.

 

గతంలో అనుమతి రాలేదు కాబట్టే విశాఖ వెళ్ళలేదు అని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు గ్యాస్ లీక్ పై శాస్త్రీయ పరిజ్ఞాన౦ అనేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. బాధితులకు అండగా నిలిచిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: