తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మొదలయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ జెండా ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. మృతులకు 50 వేలు తాము సహాయం చేస్తామని ఆయన వివరించారు. 

 

సోషల్ మీడియాలో ఎవరు అయినా మాట్లాడితే కేసులు పెడుతున్నారని, బాధితులకు అండగా నిలబడిన  వారి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను లాక్ డౌన్ కారణంగా విశాఖ వెళ్ళలేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే తాను విశాఖ వెళ్లి బాధితులను పరామర్శిస్తాను అని చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు 25 వేల మంది మహానాడు లో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: