ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం విషయంలో సిఎం వైఎస్ జగన్ పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ మీడియం ని ఎలా అయినా సరే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన శ్రీకారం చుట్టారు. కచ్చితంగా పేదవారికి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి జగన్ సుప్రీం కోర్ట్ కి వెళ్తామని నేడు ప్రకటించారు. 

 

యేడాదికి ఒక త‌ర‌గ‌తి చొప్పున ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ పెడుతున్నామని జగన్ పేర్కొన్నారు. నాలుగేళ్ల‌కు ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఒక్కో త‌ర‌గ‌తి పెంచుకుంటూ ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ‌పెడుతున్నామని ఆయన స్పష్టం చేసారు. మూడేళ్ల‌లో స్కూల్స్ బెంచ్‌లు ప్ర‌హారీలు, ఆట‌స్థ‌ల‌లు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. సామాన్యులకు కూడా ఇంగ్లీష్ మేదిం విద్య అందుబాటులో ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం కి చిన్న సమస్యలు ఎదురు అయ్యాయి అని జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: