ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించకుండా అడ్డుకుంటున్నారు అని సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏడాది పాలన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ విద్యాశాఖ పై మేధోమధన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. పేదవాడికి ఇంగ్లీష్ విద్యను అందించడానికి ఇన్ని అడ్డంకులు సృష్టిస్తారా అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

కోర్ట్ లకు వెళ్ళారని చట్టాలు చేస్తుంటే బిల్లులను అడ్డుకుంటున్నారు అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంగ్లీష్ బోధనకు గానూ టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని జగన్ పేర్కొన్నారు. పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి రావాలని ఆయన ఆకాంక్షించారు. పేదవాళ్ళ కు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి తాము సుప్రీం కోర్ట్ కి వెళ్తున్నామని జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: