దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని మరో రెండు వారాలు పెంచే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. ఐదో విడత లాక్ డౌన్ పై ఇప్పుడు కేంద్రం సమాలోచనలు చేస్తుంది. ఐదో విడత లాక్ డౌన్ లో మరిన్ని మినహాయింపు లు ఇవ్వాలని కేంద్రం భావిస్తుంది. జిమ్ లు ఆలయాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

కేంద్ర కేబినేట్ రేపు లేదా ఎల్లుండి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అవసరం అనే భావన లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని సమాచారం. ఆరు రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ కావాలని కోరుతున్నాయి. ఈ జాబితాలో తెలంగాణా కూడా ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: