ఇప్పుడు కరోనా పేరు వింటే చాలు జనాలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇంటి నుంచి ఎవరూ కూడా బయటకు రావడం లేదు. చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఒక వింత సంఘటన జరిగింది. అది ఏంటీ అంటే... షోపియన్ నుండి రాజౌరీకి ఒక గుర్ర్రం వచ్చింది. 

 

దానిని కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రావడంతో గృహ నిర్బంధం చేసారు. అది యజమాని తో పాటు వచ్చింది. జిల్లా కేంద్రంలో యజమానిని క్వారంటైన్ చేయగా గుర్రం హోం క్వారంటైన్ లో ఉంది. అది రెడ్ జోన్ కాబట్టి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. యజమాని కరోనా పరిక్షల ఫలితం వచ్చే వరకు అది  హోం క్వారంటైన్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: