ఇప్పుడు సామాజిక దూరం అనేది చాలా వరకు కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక దూరం పాటించాలి అని అన్ని విధాలుగా సూచనలు చేస్తున్నా సరే కొందరు మాత్రం మాట వినే పరిస్థితి లేదు. ఇక తాజాగా కేంద్ర మంత్రి పర్యటనలో సామాజిక దూర౦ పాటించకుండా పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. 

 

కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నిన్న మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లా పర్యటన సందర్భంగా సామాజిక దూర నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని జాతీయ మీడియా కథనం రాసింది. ఆరోగ్య కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో నిషాద్ రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి వెళ్ళారు. అక్కడ ఈ లాక్ డౌన్ ని ఉల్లంఘించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: