అదిలాబాద్ జిల్లాను ఇప్పుడు ఫుడ్ పాయిజన్ కంగారు పెడుతుంది. నిన్న 40 మంది చిన్నారులను పానీ పూరి తిని అనారోగ్యానికి గురి కావడంతో వారిని ఆస్పత్రులకు తరలించారు. తాజాగా అదిలాబాద్ జిల్లాలోనే మరో సంఘటన చోటు చేసుకుంది.  ఉట్నూర్ మండలం శ్యాంనాయక్ తండాలో దుర్గామాత పూజ జరిగింది. 

 

ఆ తర్వాత కలుషిత ఆహారం తిన్న 22 మంది అస్వస్థతకు గురి కావడంతో అంతా కంగారు పడ్డారు. అస్వస్థతకు గురైన వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉండటం తో తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారి అందరిని ఆస్పత్రికి తరలించారు అందరూ కలిసి. ఉట్నూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు చిన్నారులను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు అధికారుల సూచన మేరకు.

మరింత సమాచారం తెలుసుకోండి: