మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలం పోద్చన్ పల్లిలో మూడేళ్ళ బాలుడు బోరు బావిలో పడ్డాడు. నీరు రావడం లేదని 120 అడుగులు తవ్వి యజమాని దాన్ని అలాగే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేసాడు.  ఇక అప్పటి నుంచి ఆ బావి అలాగే ఉంది. 

 

నేటి సాయంత్రం ఆడుకుంటూ వెళ్ళిన బాలుడు ఆ బావిలో పడ్డాడు. దీనితో వెంటనే ఫైర్ సిబ్బందికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ బావిలో రాళ్ళు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: