మెదక్ జిల్లా పోడ్చాన్ పల్లిలో బోరు బావిలో మూడేళ్ళ చిన్నారి పడటంతో సంచలనంగా మారింది. బోరు తవ్విన కాసేపటికే చిన్నారి బావిలో పడ్డాడు. తల్లితో కలిసి వస్తూ ఉండగా తాత తల్లి కళ్ళ ముందే బావిలో పడిపోయాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు అధికారులు. బాలుడ్ని కాపాడటానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

బోరు బావికి సమాంతరంగా మరో  బావి తవ్వడానికి జేసీబీలతో ప్రయత్నం చేస్తున్నారు. బోరు బావి వద్దకు స్థానికంగా ఉండే వారు అందరూ చేరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అక్కడికి ఐపిఎస్ చందన దీప్తి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 120 అడుగుల లోతులో బాలుడు పడటం తో ఇప్పుడు ఆక్సీజన్ ని పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: