మెదక్ జిల్లా పోద్చన్ పల్లి లో ఒక బాలుడు బోరు బావిలో పడ్డాడు. నేటి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తల్లి తో పాటు పొలం లో నడుస్తూ ఉన్న సమయంలో చిన్నారి బావిలో పడ్డాడు. బోరు బావి తవ్విన కాసేపటికే చిన్నారి అందులో పడ్డాడు. పొలంలో నీటి కోసం బాలుడి తండ్రి మూడు బావులు తవ్వించాడు. 

 

అయితే నీళ్ళు పడకపోవడం తో వాటిని మూసి వేసాడు. ప్రస్తుతం చిన్నారిని కాపాడటానికి అధికారులు చర్యలు చేపట్టారు. బోరు బావిని మూసి వేసే లోపే అతను అందులో పడ్డాడు. ఇక స్థానిక అధికారులు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షించి తమ సూచనలను ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: