బుధవారం ఒక్క రోజే 12 పాజిటివ్ కేసులు నమోదు ఐన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్నీ డాక్టర్ పుప్పాల శ్రీధర్ తెలియజేసారు. జగిత్యాల జిల్లాలో ఎక్కువగా వలస కార్మికులు ఉన్నారు వారాంతకుడా కూలి పనుల కోసం మహారాష్ట్ర లోని ముంబై నగరం నుండి వచ్చారు. వీరంతా కూడా దాదాపు 5600 వరకు ఉన్నట్లు అయన తెలిపారు. గతం లో కొంతమందికి కొరోనా టెస్టులు చేయగా ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది.
తాజాగా చేసిన టెస్టుల్లో దాదాపుగా 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. వీరిని వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ 5600 మందిని కూడా హోమ్ క్వారంటైన్ లో నిర్బంధం లో ఉంచారు. బుధవారం కరోనా సోకిన వారిలోమల్యాల మండలంలో 6, మేడిపల్లి మండలంలో 3, కోరుట్ల 1, గొల్లపల్లి మండలంలో 1, కథలాపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. వీరిలో ఆరేళ్ల పాప కూడా ఉంది.