పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామంలో బుధవారం బోరు బావిలో చిన్నారి పడిన ఘటన యావత్ తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. అయితే బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్‌ సాయివర్ధన్‌ మృతి చెందాడు. బోరు భావి 25 అడుగుల లోతులో అతని మృతదేహా లభ్యమైంది. అయితే పొలం పనులను ముగించుకుని తన తాతతో కలసి సంజయ్ సాయి వర్ధన్ ఇంటికి వెళుతూ ఉండగా ఆ పక్కనే అప్పుడే వేసిన బోరుబావి లో చిన్నారి సంజయ్ పడిన విషయం తెలిసిందే.

 

అధికారులు ఆ  బాలుడిని కాపాడడానికి 12 గం. శ్రమించారు. అయితే బాలుడు 25 అడుగుల లోతులో ఉండవచ్చని భావించి ఆ ప్రక్కనే గొయ్యిని సమాంతరంగా త్రవ్వి బాలుడిని వెలికి తీశారు అయితే అప్పటికే బాలుడు చనిపోవడం తో ఆ బాలుడి మృత దేహాన్ని వెలికి తీశారు. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: