సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ ఆయనకు పార్టీలు, వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా సోషల్ మీడియా వేదికగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. ఇక నందమూరి వంశంలో ఆయన మనవళ్లు.. తెలుగు సినిమా హీరోలు అయిన నందమూరి కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా తన తాతను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది... మీ రూపు కానక తెలుగు గుండె తల్లిడిల్లుతోంది.. పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని.. ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా అని ట్వీట్ చేశారు.
ఇక కళ్యాణ్రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సినిమాలకు ముందు వచ్చే ఓ విశ్వవిశ్యాత మీ గాధ.. మీ బోధ మాకు భగవద్గీత పద్యం పోస్ట్ చేసి తాతను గుర్తు చేసుకున్నారు. ఇక ఇద్దరు మనవళ్లు ఎన్టీఆర్ను గుర్తు చేసుకుని సోషల్ మీడియా వేదికగా ఆయనపై తమకు ఉన్న అనంతాభిమానం చాటుకున్నారు. ఇక మరి ఎన్టీఆర్ తనయుడు బాలయ్య ఎలా స్పందిస్తాడన్నది మాత్రం చూడాలి.
మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత #joharntr pic.twitter.com/Q7IdzByw1u
— Kalyanram nandamuri (@NANDAMURIKALYAN) May 28, 2020
మీరు లేని లోటు తీరనిది... pic.twitter.com/FA1uyWaWoS
— jr ntr (@tarak9999) May 28, 2020