ఎప్పటికప్పుడు ఎవరితో ఒకరితో గొడవలు పెట్టుకుంటూ ఏదోక వ్యాఖ్య చేస్తూ వివాదాస్పదంగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ట్విట్టర్ తో సున్నం పూసుకున్నారు. ఆ సంస్థ ఆయన ట్వీట్లను తప్పుబట్టింది. ఆ తర్వాత ట్రంప్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.
త్వరలోనే ట్రంప్ సోషల్ మీడియా సంస్థలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేయబోతున్నారని వైట్ హౌస్ ప్రతినిధి కైలీ మెక్నానీ బుధవారం మీడియాకు వివరించారు. ట్రంప్ తో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు వెళుతున్న ఎయిర్ఫోర్స్ వన్లో ఉన్న విలేకరులతో ఆయన మాట్లాడారు. ట్రంప్ ట్వీట్ లు తప్పుడు ప్రచారం చేయించే విధంగా ఉన్నాయని ట్విట్టర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Trump to sign executive order about social media platforms after twitter flags his tweets https://t.co/d7tCm937Zi
— Republic (@republic) May 28, 2020