ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్టు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం పై 5 జీ నెట్వర్క్ ప్రారంభించేందుకు చైనా నిర్ణయించింది... ఎవరెస్టు శిఖరాన్ని కొమోలంగ్మా అనే పర్వతం అంటూ ప్రస్తావించిన చైనా... 5 జీ పరిజ్ఞానంతోపాటు ఉపగ్రహ నావిగేషన్ ఉపయోగించే ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి లక్ష్యం పూర్తి చేసినట్లు మే 27వ తేదీన ప్రకటించింది.
చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ అనేవారు... పర్వతారోహణ సూట్స్ ధరించి 8 మంది నిపుణుల బృందంతో... 8300 మీటర్ల ఎత్తులో... ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారూ . ఇక దాదాపు రెండు గంటలపాటు ఎవరెస్టు శిఖరం వద్ద ఉన్న చైనా నిపుణులు... మొత్తం ఎవరెస్టు శిఖరం పై 5జి కమ్యూనికేషన్ టెక్నాలజీ తో అనుసంధానం చేయాడాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఏకంగా మిలియన్ల మంది చూశారు. మెరుగైన టెక్ దిగ్గజం అయిన హువావే సాయంతో చైనా 5 జి నెట్వర్క్ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం కవర్ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు.