దేశ వ్యాప్తంగా వలస కార్మికులు, అలాగే తినడానికి తిండి లేని పేదలు పడుతున్న బాధల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. లక్షల మంది ప్రజలు ఇప్పుడు ఆకలితో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే బీహార్ లోని ముజఫర్ రైల్వే స్టేషన్ లో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 

 

ఒక తల్లి మరణించి ఉంటుంది... ఆ విషయం తెలియని చిన్నారి ఆమెను లేపడానికి గానూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ వీడియోలో తల్లి కదలకుండా ఉండటం చూసిన ఆ చిన్నారికి కోపం కూడా వస్తుంది. దేశం మొత్తం కూడా కన్నీరు పెట్టిన సన్నివేశం ఇది. ఆ చిన్నారి ఎవరు అనేది తెలియదు. వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: