లాక్ డౌన్ లో భార్యా భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి అనే వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఇవి క్రమంగా గృహ హింస కు కూడా దారి తీస్తున్నాయి. ఇక తాజాగా కర్నూలు జిల్లాలో ఒక సంఘటన జరిగింది. భార్యా భర్తల మధ్య కొత్త ఫోన్ చిచ్చు పెట్టింది. భార్య కొత్త ఫోన్ కొనడం తో భర్త ఆగ్రహం వ్యక్తం చేసాడు.

 

ఇద్దరి మధ్య ఫోన్ గురించి పెద్ద గొడవ కూడా జరిగింది. తనకు చెప్పకుండా ఫోన్ కొన్నావ్ అని భర్త ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాధపడిన ఆమె వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: