మ‌న దేశంలో భానుడు ప్ర‌చండ భానుడిగా మారి నిప్పులు కురిపిస్తున్నాడు. భానుగి సెగ‌ల ధాటికి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు. మ‌రోవైపు ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా నమోదు అయిన ఉష్ణోగ్ర‌త‌లు చూస్తే ఓవ‌రాల్‌గా ప్ర‌పంచంలో 15 న‌గ‌రాల్లో 10 న‌గ‌రాలు మ‌న‌దేశంలోనే ఉన్నాయి. ఈ విష‌యాన్ని ఈ 1 డొరాడో అనే వెబ్ సైట్ వెల్ల‌డించింది. ఇక అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు ప్ర‌పంచంలోనే మ‌న‌దేశంలోనే ఎక్కువుగా న‌మోదు అయ్యాయి.

 

రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌కు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చురు అనే ప్రాంతంలో ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు అయ్యింది. ఉత్త‌ర‌, మ‌ధ్య భార‌తంలో ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న తీవ్ర‌మైన వేడిగాలులు మ‌రో 24 గంట‌ల పాటు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: