దేశ వ్యాప్తంగా వలస కార్మికులు సొంత పూర్లకు వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వారి బాధలను అర్ధం చేసుకునే కొందరు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక విషయం వెలుగులోకి వచ్చింది. తన వద్దకు పని చేయడానికి బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలను సొంత ఊరికి పంపానికి గానూ.. 

 

గెహ్లాట్ అనే ఒక పుట్ట గొడుగుల వ్యాపారి వారి కోసం విమానం టికెట్ లను కొనుగోలు చేసారు. 68 వేలు ఖర్చు చేసివారికి ఆయన టికెట్ లు కొని సొంత ఊర్లకు పంపించారు. మొత్తం పది మంది కూలీలను ఈ విధంగా పంపించారు. దీనిపై అధికారులు అతన్ని అభినందించారు. తాము ఎప్పుడు విమానం ఎక్కలేదని కార్మికులు మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: