వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట లో జరిగిన వరుస హత్యల ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. నిందితుడు సంజయ్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం వాళ్ళు రికార్డ్ చేసారు. ఇక ఈ కేసులో కీలకంగా మారింది నిద్ర మాత్రల విక్రయం. నిద్ర మాత్రలను అతను ఎక్కడ కొన్నాడు అనేది అధికారులు ఆరా తీస్తున్నారు. 

 

అతను వరంగల్ లో మూడు మెడికల్ షాపుల్లో 60 మాత్రలు కొన్నాడని విచారణలో వెల్లడి అయింది. అసలు అతను ఎక్కడ వాటిని విక్రయి౦చాడు డాక్టర్ సూచన లేకుండా వాటిని ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణా ఔషధ నియంత్రణ మండలి  ఈ కేసుని సీరియస్ గా తీసుకుంది. అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: