ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 54 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి తో పోలిస్తే నేడు తక్కువగా కేసులు నమోదు అయ్యాయి. నిన్న 68 కేసులు నమోదు అయ్యాయి. నేడు ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

ఇప్పటి వరకు 59 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో కరోనా కేసులు 2841 కి చేరుకున్నాయి. 8 కేసులకు కోయంబేడు తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు 824 గా ఉండగా... 1958 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారని ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: