ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రభుత్వ౦ 5 ఏళ్ళు ఉండే అవకాశం లేదని త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని అన్నారు. 

 

ఎన్టీఆర్ వారసులం తాము కాదని కార్యకర్తలే అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఎక్కువ కాలం ఉండటం అనుమానం గానే ఉందని అన్నారు బాలకృష్ణ. ఇక సినీ పెద్దలు తెలంగాణా ప్రభుత్వం తో చర్చలు జరిపే విషయం తనకు తెలియదని బాలయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: