ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు టీడీపీ సీనియర్ నేతలు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని నేమరవేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి తమ నివాళులు అర్పిస్తున్నారు. ఇక మీడియా లో కూడా కొందరు నాయకులు ఎన్టీఆర్ తో తమకు ఉన్న జ్ఞాపకాలను నేమరవేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇవాళ తాను రాజకీయాల్లో ఎదిగానంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్షేనని, పసుపు జెండా ఎప్పుడూ రెపరెపలాడేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ పరిపాలన ఇలానే సాగితే రాబోయే తరాలకు తీరని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు అయ్యన్న.

మరింత సమాచారం తెలుసుకోండి: